మరోసారి రెచ్చిపోయిన మావోయిస్టులు.. ఐఈడీ పేలుడు..

మరోసారి రెచ్చిపోయిన మావోయిస్టులు.. ఐఈడీ పేలుడు..

జార్ఖండ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సరయ్‌కెల్లాలోని కుచాయ్‌ ప్రాంతంలో భద్రతాసిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 11 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇవాళ తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఝార్ఖండ్‌ పోలీసులు, 209 కోబ్రా బెటాలియన్‌కు చెందిన సిబ్బంది సంయుక్త ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా.. మావోయిస్టులు వీరిపై బాంబు దాడి చేశారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌ సాయంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story