హృదయాలను ఏలే ‘దొరసాని’

హృదయాలను ఏలే ‘దొరసాని’

రియలిస్టిక్ అండ్ ఇంటెన్సిటీ ఉన్న కథలకు ఇప్పుడు ప్రేక్షకులు అదరణ లభిస్తుంది. అలాంటి ఓ రియలిస్టిక్ స్టోరీతో వస్తోన్న చిత్రమే ‘దొరసాని’. తెలంగాణలోని ఓ ప్రాంతంలో 80 దశకం లో జరిగిన కథగా వస్తోంది. లేటెస్ట్ గా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో కథ లోంచి పరిచయం అయిన రాజు, దొరసాని చూడ ముచ్చటగా ఉన్నారు.కారులో కూర్చున్న దొరసానిని ఆ పక్కనే సైకిల్ పై వచ్చిన హీరో ఆరాధనగా చూస్తున్నట్టుగా ఈ ఫస్ట్ లుక్ ఒక రకంగా కథలోని ఆత్మను చెబుతోంది. రాజు కళ్ళల్లో ప్రేమ, దొరసాని కళ్ళల్లో దర్పం ఈ ప్రేమ కథ లో వైరుధ్యాన్నిచూపిస్తున్నాయి. హీరో, హీరోయిన్ల డ్రెస్సింగ్ తో పాటు ఆమె ఉన్న కార్ ను బట్టి కథకు తగ్గట్టుగా నాటి కాలపు వాతావరణాన్ని ఈ చిత్రంలో రీ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక హీరో, హీరోయిన్లు గా పరిచయం చేస్తూ సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్ , బిగ్ బెన్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం తో కెవిఆర్ మహేంద్ర దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. అలాగే ఈ చిత్ర టీజర్ జూన్ 6 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు

Tags

Read MoreRead Less
Next Story