ఆమెను కాపాడ్డం కోసం అతను రంజాన్ ఉపవాస దీక్షను..

ఆమెను కాపాడ్డం కోసం అతను రంజాన్ ఉపవాస దీక్షను..

మతం కంటే మానవత్వం గొప్పదని నిరూపించాడు ఓ వ్యక్తి. నీతి, నిజాయితీ ఇంకా చావలేదని, విలువలు ఇంకా బతికే ఉన్నాయనే దానికి తాజాగా జరిగిన ఈ సంఘటన రుజువు చేసింది. మరో వ్యక్తి ప్రాణాలు కాపాడడం కోసం రంజాన్ ఉపవాస దీక్షను కూడా వదిలేశాడు ఓ ముస్లిం వ్యక్తి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న గర్భిణికి సహాయం చేయడానికి రాజస్తాన్‌‌కి చెందిన ఓ ముస్లిం వ్యక్తి తన ఉపవాసాన్ని కూడా లెక్కచేయలేదు. సావిత్రి దేవి గర్భిణి. ఆమెకు అత్యవసరంగా రక్తం అవసరం పడడంతో అష్రఫ్ ఖాన్ అనే వ్యక్తి తన మత పవిత్రమైన ఆచారాన్ని కూడా వదిలేసి రక్తాన్ని దానం చేశాడు. తన సంబంధీకులకు అత్యవసరంగా B నెగిటివ్ రక్తం కావాలంటూ వచ్చిన ఓ మెసేజ్‌ని చూసిన అష్రఫ్ ఖాన్ వెంటనే స్పందించాడు. మెసేజ్ లో ఉన్న నెంబర్ చూసి సదరు వ్యక్తికి కాల్ చేశాడు. అనంతరం పేషెంట్ ఉన్న ఆస్పత్రికి వెళ్ళి బ్లెడ్ డొనేట్ చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story