ఎంత దారుణం..కడుపులో పెట్టుకుని సాకిన ఆ తండ్రిని..

ఎంత దారుణం..కడుపులో పెట్టుకుని సాకిన ఆ తండ్రిని..

కని పెంచి పెద్దవాన్ని చేశాడా తండ్రి. కొడుకును కోసం సర్వం ధారపోశాడు. కడుపులో పెట్టుకుని సాకిన తండ్రికి.. ఆ కొడుకు ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసా? ఒళ్లు హునం అయ్యేలా కొట్టడం. అవును తిరుపతిలో ఓ కొడుకు కన్నతండ్రిపై చేసిన దాడి మానవత్వాన్ని మంట గలిపేలా చేస్తోంది.

పండు ముసలి తండ్రి. నడవడం కూడా చేతకాని పెద్దాయన. అలాంటి వృద్ధ తండ్రిని ఎలా చూసుకోవాలి. జన్మనిచ్చి తండ్రి రుణం ఎలా తీర్చుకోవాలి. కానీ తిరుపతిలో ఓ దుర్మార్గపు కొడుకు ఇదిగో ఇలా రుణం తీర్చుకున్నాడు.

తనకు మానవత్వం లేదని..తానో మృగాడినని నిరూపించుకున్నాడా కొడుకు. కన్నతండ్రిపై అతి కర్కశంగా వ్యహరించిన ఈ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. వృద్ధ తండ్రిపై కొడుకు దాడి స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.తిరుపతి నగరంలోని అనంత వీధిలో 88 ఏళ్ల వృద్ధుడు మునికృష్ణయ్య నివసిస్తున్నాడు. పెద్ద కొడుకు విజయ్‌ తన భార్య గత కొంత కాలంగా భూమి అమ్మకం విషయంలో ఆయన్ను వేధిస్తున్నారు. తమకున్న రెండు సెంట్ల స్థలాన్ని అప్పుల కోసం మునికృష్ణయ్య విక్రయించాలనుకోవడమే కొడుకు ఆగ్రహానికి కారణమైంది. దీంతో విచక్షణ కోల్పోయిన కొడుకు... కారం పొడి చల్లి, ఇనుప రాడ్డుతో తల్లిదండ్రులపై దాడి చేశాడు. భార్య, బావమరిది సైతం అతడికి సహకరించారు.

కారం మంటకు తట్టుకోలేక ఏడుస్తున్న తండ్రిపై కుమారుడు కనీసం జాలి చూపలేదు. ఇనుపరాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో మునికృష్ణయ్య తీవ్రంగా గాయపడ్డాడు. కొడుకు దాడిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వృద్ధ దంపతులు.బాధితుడు ఇంతకు ముందే ఎన్నోసార్లు తిరుపతి వెస్ట్ జోన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే ప్రస్తుతం దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేసు నమోదు చేసిన ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story