టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదు - లోకేష్‌

టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదు - లోకేష్‌

గుంటూరు జిల్లా మంగళగిరిలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త ఉమాయాదవ్‌ కుటుంబాన్ని.. మాజీ మంత్రి లోకేష్‌ పరామర్శించారు. ఉమాయాదవ్‌ హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆరుగురు టీడీపీ కార్యకర్తలను చంపారని.. అయినా సంయమనం పాటిస్తున్నామన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. రాజకీయ హత్యలపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు లోకేష్. టీడీపి నాయకత్వం కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటుందని లోకేష్‌ భరోసా ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదన్నారు లోకేష్.

Tags

Read MoreRead Less
Next Story