సంచలన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం

సంచలన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం

కాంగ్రెస్ నాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని హస్తం నాయకత్వం రద్దు చేసింది. కేపీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్‌ ప్రెసిండెంట్‌లను మాత్రం కొనసాగించారు. మిగతా పదవులన్నింటినీ రద్దు చేశారు. కర్ణాకటలోని కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కాంగ్రెస్‌ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కేపీసీసీ ధోరణితో విసుగు చెందిన పలువురు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఏకంగా కేపీసీసీని రద్దు చేయడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story