కర్ణాటకలో సిఎల్పీ సమావేశం.. రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం..

కర్ణాటకలో సిఎల్పీ సమావేశం.. రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం..

కర్నాటక సంక్షోభం నేపథ్యంలో సిఎల్పీ సమావేశం అయ్యింది. ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజా సమావేశం ఆసక్తికరంగా మారింది. డిప్యూటీ సీఎం పరమేశ్వర, మాజీ సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ సహా ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ నేతృత్వంలో సిఎల్పీ భేటి జరుగుతోంది.

అటు సిఎల్పీ సమావేశానికి రెబల్ ఎమ్మెల్యేలు మగ్గురు హాజరయ్యారు. సౌమ్యారెడ్డి, మునిరత్న, బైరతి బసవరాజ్ లు ఈ సమావేశానికి వచ్చారు. డీకే శివకుమార్ జరిపిన చర్చలతో వారు దారికి వచ్చినట్టు తెలుస్తోంది. అటు ఢిల్లీ వెళ్లిన డీకే శివకుమార్ కూడా అహ్మద్ పటేల్ తో సమావేశం అనంతరం తిరిగి కర్నాటక చేరుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story