బీజేపీలో చేరనున్న టీడీపీ కీలకనేత

బీజేపీలో చేరనున్న టీడీపీ కీలకనేత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ బీజేపీలో చేరనున్నారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా సమక్షంలో కాషాయ కండువ కప్పుకోనున్నారు. హైదరాబాద్‌కు బయల్దేరే ముందు కొత్తగూడెంలోని విజయ విగ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ర్యాలీగా బయల్దేరి ఎన్టీఆర్, మాజీ మంత్రి కోనేరు నాగేశ్వర్రావు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి కోసం బీజేపీలో చేరుతున్నట్లు సత్యనారాయణ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story