సీఎం కేసీఆర్‌కు సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క లేఖ

సీఎం కేసీఆర్‌కు సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క లేఖ

టీఆర్ఎస్ స‌ర్కారు టార్గెట్‌గా కాంగ్రెస్ విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతోంది. రెండోసారి అధికారానికి దూర‌మైనా .. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స‌ర్కారును నిల‌దీయ‌డంలో వెన‌క‌డుగు వేయ‌డం లేదు. స‌చివాల‌య భ‌వ‌నాల కూల్చివేత,.కొత్త అసెంబ్లీ, స‌చివాల‌య భ‌వ‌నాల నిర్మాణాల‌పై ఇప్ప‌టికే సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ .. ప్ర‌జ‌ల్లో దోషిగా నిలిపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా కేసీఆర్ స్వంత గ్రామ‌మైన చింత‌మ‌డ‌కకు వ‌రాల జ‌ల్లుపై కేసీఆర్‌ను కార్న‌ర్ చేస్తున్నారు. చింత‌మ‌డ‌క‌లో ప్ర‌తి కుటుంబానికి ప‌ది ల‌క్ష‌ల మంజూరును స్వాగ‌తిస్తూ .. అదే త‌ర‌హాలో రాష్ట్రంలో ప్ర‌తి కుటుంబానికి ల‌బ్ది చేకూర్చాల‌ని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సీఎం కేసీఆర్‌కు సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క లేఖ రాశారు. సీఎంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను స‌మానంగా చూస్తానంటూ మీరు చేసిన ప్ర‌మాణాన్ని గుర్తు చేస్తున్నానంటూ పొలిటిక‌ల్ విమ‌ర్వ‌లు గుప్పించారు.

మ‌రోవైపు హైద‌రాబాద్‌లోని పాత‌బ‌స్తీ ఆయుర్వేద ఆసుప‌త్రిని అక్క‌డి నుంచి ఎర్ర‌గ‌డ్డ‌కు త‌ర‌లించాల‌నే నిర్ణ‌యంపై నిప్పులు చెరుగుతున్నారు హ‌స్తం నేత‌లు. పాత‌బ‌స్తీలో ఆయుర్వేద విద్యార్థులు చేస్తున్న ఆందోళ‌న‌కు సంఘీభావం తెలిపిన ఆ పార్టీ నేత‌లు.. విద్యార్థినుల‌పై పోలీసుల అస‌భ్య‌క‌ర ప్ర‌వ‌ర్త‌న‌పై అగ్గిమీద గుగ్గిల‌మైయ్యారు. ఈ హా‌స్పిట‌ల్ త‌ర‌లించాల‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యం వెనుక ఆంత‌ర్య‌మేంట‌ని నిల‌దీస్తున్నారు కాంగ్రెస్ నేత‌లు.

చింత‌మ‌డ‌క వ‌రాల‌పై కేసీఆర్ స్పందించ‌క పోతే .. ప్ర‌జ‌ల్లో అస‌హ‌నం పెరిగి.. రాష్ట్రంంలో అశాంతి పెరిగే అవ‌కావ‌లున్నాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు. దీనిపై అర్హులైన కుటుంబాల‌న్నింటినీ ఏకం చేసేందుకు ప్ర‌త్యేక్ష కార్య‌చ‌ర‌ణ తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story