కో-ఆపరేటివ్ బ్యాంక్లో భారీ స్కాం
By - TV5 Telugu |20 Sep 2019 4:53 AM GMT
కరీంనగర్ గట్టుదుద్దేనపల్లి పరపతి సహకార సంఘంలో కుంభకోణం కలకలం రేపుతోంది. కోటి 18 లక్షల రూపాయల మేర అక్రమాలు జరిగినట్టు ఆడిటింగ్లో వెలుగు చూసింది. కోట్ల రూపాయల సొమ్ముకు లెక్కలు లేకుండా పోయాయని ఆడిటింగ్ అధికారులు చెబుతుంటే.. అన్నిటికీ లెక్కలున్నాయని పాలక వర్గం సమర్ధించుకుంటోంది. అన్ని లెక్కలు సరిగ్గా ఉంటే కోటి 18 లక్షలు ఏమైపోయాయంటే ఎవరి వద్ద సరైన సమాధానం లేదు. 60 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సహకార బ్యాంక్లో అసలు ఏం జరుగుతుందనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. బ్యాంక్ స్కాంలో నిధులు స్వాహా అవుతుండడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.
Also watch:
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com