రోడ్డు పక్కన నిలబడ్డ స్టూడెంట్స్పైకి దూసుకెళ్లిన కారు
By - TV5 Telugu |20 Sep 2019 3:31 AM GMT
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ఓ కారు.. రోడ్డు పక్కన నిలబడి ఉన్న విద్యార్థులు, చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని వెంటనే సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో డ్రైవ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Also watch :
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com