పాక్‌ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం : కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

పాక్‌ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం : కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

దేశ చరిత్రలో కాంగ్రెసేతర పార్టీగా బీజేపీ సొంత మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి. కాకినాడలో పర్యటిస్తున్న కిషన్‌ రెడ్డి స్థానిక JNTU ఆడిటోరియంలో జరిగిన 370 ఆర్టికల్‌ రద్దు చర్చలో పాల్గొన్నారు. జనసంఘ్‌ పార్టీ పుట్టిందే ఆర్టికల్‌ 370కి వ్యతిరేకంగా అని కిషన్‌ రెడ్డి గుర్తు చేశారు. ఆర్టికల్‌ 370 కారణంగా పాకిస్తాన్‌తో నాలుగు యుద్ధాలు జరిగాయన్నారు. జవహర్‌లాల్ నెహ్రు 370 ఆర్టికల్‌ మన నెత్తిన రుద్దారని కిషన్‌ రెడ్డి అన్నారు. భారతదేశ పౌరుషమేంటో ప్రపంచానికి మోదీ చూపించారని చెప్పారు కిషన్‌ రెడ్డి. ఈ సారి యుద్ధమంటూ వస్తే పాక్‌ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story