మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం

తూర్పుగోదావరి జిల్లా గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది ఏపీ సర్కార్.. గాయపడ్డవారికి చికిత్స అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా, లాంచీ మునిగిన ప్రాంతంలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు జరుగుతున్నాయి. సహాయకచర్యల్లో సుమారు 140 మంది సహాయక సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఇప్పటివరకు 25 మందిని రక్షించారు. బోటులో మొత్తం 61 మంది ప్రయాణికులున్నారు.

Read MoreRead Less
Next Story