ఎట్టకేలకు దిగివచ్చిన ఏపీ ప్రభుత్వం

ఎట్టకేలకు దిగివచ్చిన ఏపీ ప్రభుత్వం

పల్నాడు ఎపిసోడ్‌లో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది.. టీడీపీ అధినేత చంద్రబాబు ఛలో ఆత్మకూరు పిలుపుతో దిగివచ్చిన ప్రభుత్వం బాధితులకు రక్షణ కల్పించే ప్రయత్నాలు ప్రారంభించింది.. బాధితులందరికీ రక్షణ కల్పిస్తామని హోంమంత్రి సుచరిత చెప్పారు. హోంమంత్రి మీడియా సమావేశం తర్వాత ఆర్డీవో గుంటూరులోని వైసీపీ బాధితుల శిబిరానికి వెళ్లి వారితో మాట్లాడారు.. రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆత్మకూరు నుంచి వెళ్లిపోయిన 15 కుటుంబాలను ప్రత్యేక వాహనాల్లో సొంత ఊరికి చేర్చారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story