గన్నేరు పప్పు తిని ప్రాణం తీసుకోవడానికి ట్రై చేశాడు.. చివరకు..
ఓ యువకుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. లాడ్జ్లో రూమ్ తీసుకున్నాడు. గన్నేరు పప్పు తిని ప్రాణం తీసుకోవడానికి ట్రై చేశాడు. అదే వీడియోను ఫ్రెండ్స్కు పంపించాడు. ఆ వీడియో చూసిన స్నేహితులు, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వేగంగా స్పందించిన పోలీసులు, ఆ యువకుని ప్రాణాలు కాపాడారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
శ్రీకాకుళం జిల్లా రాజాం మండలానికి చెందిన రాజు అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆ క్రమంలో బొబ్బిలికి వచ్చిన రాజు, అక్కడ ఓ లాడ్జ్లో దిగాడు. గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ స్నేహితులకు వీడియో పంపించాడు. అది చూసిన స్నేహితులు, వెంటనే బొబ్బిలి పోలీసు లకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, లాడ్జీలను గాలించి ఆ యువకున్ని పట్టుకున్నారు. హాస్పిటల్కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించారు. అనంతరం తల్లిదండ్రులను పిలిపించి యువకున్ని అప్పగించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com