కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన టీడీపీ నేతలు

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన టీడీపీ నేతలు

పల్నాడు ప్రాంతంలో వైసీపీ దాడులపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. బాధితులతో కలిసి ఆయన వద్దకు వెళ్లి పరిస్థితి వివరించారు. ప్రస్తుతం గుంటూరులో టీడీపీ ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో ఉంటున్న బాధితులు.. తమ గోడును కేంద్రమంత్రికి చెప్పుకున్నారు. వైసీపీ దాడులతో గ్రామాల్లో ఉండలేకపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులు రక్షణ కల్పించడం లేదని ఆరోపించారు. దీంతో.. బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ అంశంపై ఐజీ, డీజీపీలతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story