దొంగ లెక్కలు రాసుకోవడం మాత్రమే మీకు తెలుసు - చంద్రబాబు

దొంగ లెక్కలు రాసుకోవడం మాత్రమే మీకు తెలుసు - చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం ఆపేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విశాఖలో పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తున్న చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రివర్స్‌ టెండర్‌ పేరుతో పోలవరం నిలిచిపోయిందన్నారు. గ్రామ సచివాలయాలకు వాళ్ల పార్టీ కలర్‌ వేశారని, ఇక స్మశానాలకు కూడా పార్టీ రంగులేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మీకు తెలుసా.. దొంగ లెక్కలు రాసుకోవడం మాత్రమే తెలుసని ఘాటు విమర్శలు చేశారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story