భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా.. వైసీపీ నేత యార్లగడ్డ
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ గందరగోళం నెలకొంది. సీఎంను టీడీపీ ఎమ్మెల్యే వంశీ కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో స్థానికంగా వైసీసీ నేతల్లో కలవరం మొదలైంది. నియోజకవర్గం ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకట్రావ్ భగ్గుమంటున్నారు. ఇప్పటికే ఆయన నివాసానికి చేరుకున్న కార్యకర్తలు వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో యార్లగడ్డ నివాసంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
అటు వంశీ చేరతారన్న వార్తలపై యార్లగడ్డ కార్యకర్తల ముందు ఆవేదనగా స్పందించారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని... టీడీపీ హయంలో శ్రేణులు ఇబ్బందిపడ్డారు. గతంలో వైఎస్ భారతమ్మపై కూడా కేసులు పెట్టారు. అలాంటిది ఇప్పుడు వారినే పార్టీలోకి తీసుకోవడం ఏంటన్న భావన వ్యక్తం చేశారు. పేర్ని నాని ఫోనులో మాట్లాడారని... అధినేత జగన్ ను కలిసిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని యార్లగడ్డ అనుచరులతో అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com