జమ్మూకాశ్మీర్‌లో మరో యాత్రకు బ్రేక్‌

జమ్మూకాశ్మీర్‌లో మరో యాత్రకు బ్రేక్‌

ఉగ్రవాద ముప్పు కారణంగా నిన్న(శుక్రవారం) అమర్‌నాథ్ యాత్రను నిలిపివేసిన జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వం.. ఇవాళ (శనివారం) మరో యాత్రకు బ్రేకులు వేసింది. కిష్త్వర్ జిల్లాలో జరిగే మచైల్ మాత యాత్రను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉదంపూర్ వద్ద యాత్రికులను నిలిపివేశారు.

జులై 25న మొదలైన మచైల్‌ యాత్ర.. సెస్టెంబర్‌ 5 వరకు జరగాల్సి ఉంది. దాదాపు నిన్న(శుక్రవారం) అమర్‌నాథ్‌ యాత్ర, నేడు (శనివారం) మచైల్‌ యాత్ర నిలిపివేయడంతో అసలు జమ్మూకాశ్మీర్లో ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story