పట్ట పగలు తహసీల్దార్‌‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన..

పట్ట పగలు తహసీల్దార్‌‌పై  పెట్రోల్‌ పోసి నిప్పంటించిన..

mro-vijaya-reddy

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లోని తహసీల్దార్‌ కార్యాలయంలో దారుణం జరిగింది. పట్ట పగలు తహసీల్దార్‌ విజయారెడ్డిపై ఓ దుండగుడు పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో విజయారెడ్డి సజీవదహనం అయ్యారు.

మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు దుండగుడు కార్యాలయంలోకి ప్రవేశించాడు. తహసీల్దార్‌ విజయారెడ్డితో మాట్లాడతానని చెప్పి దుండగుడు లోపలకి వెళ్లాడు. ఆమె చాంబర్‌లోనే దుండగుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.

Tags

Read MoreRead Less
Next Story