అది రివర్స్ టెండరింగ్ కాదు.. రిజర్వ్ టెండరింగ్: చంద్రబాబు
By - TV5 Telugu |6 Nov 2019 12:23 PM GMT
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వ్ టెండరింగ్ చేస్తూ.. కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. సర్కారు అన్ని రంగాల్లోనూ విఫలమైందన్నారు. కృష్ణా, గోదావరి నదులకు వరదలు వస్తే.. సీఎం జగన్ విదేశీ పర్యటనలకు వెళ్లారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 3 వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. మద్యపానం నిషేధం పేరుతో రేట్లను పెంచారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులకు పార్టీ రంగులు వేయడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com