ప్రభుత్వానికి ఆర్టీసీ ఆస్తులపై ఉన్న ప్రేమ.. కార్మికులపై లేదు: లక్ష్మణ్
By - TV5 Telugu |6 Nov 2019 10:06 AM GMT
ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. సీఎం కేసీఆర్ పట్టింపులకు పోకపోతే సమస్య ఎప్పుడో పరిష్కారం అయ్యేదన్నారు. ప్రభుత్వానికి ఆర్టీసీ ఆస్తులపై ఉన్న ప్రేమ.. ఉద్యోగులపై లేదని విమర్శించారు. బీజేపీ నేతలపై దాడులు పెరగడంపైనా లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని.. త్వరలోనే పార్టీ తరపున కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఆర్టీసీ జేఏసీ నేతలు లక్ష్మణ్ను కలిసి.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com