నా భర్తను ఎవరో పావుగా వాడుకున్నారు : సురేష్ భార్య లత
By - TV5 Telugu |6 Nov 2019 8:21 AM GMT
తహసీల్దార్ విజయారెడ్డి హత్యపై సురేష్ భార్య లత తొలిసారిగా పెదవి విప్పింది. టీవీ5తో మాట్లాడింది. తన భర్తను ఎవరో పావులా వాడుకున్నారని అనుమానం వ్యక్తం చేసింది. తన భర్త ఇలాంటి ఘోరాలు చేసేవ్యక్తి కాదని, చాలా అమాయకుడని కన్నీరు పెట్టింది. అసలు ఈ భూమి విషయమే తమకు తెలియదని లత చెప్తోంది. ఈ మధ్య సురేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో తిరుగుతున్నాడని, అప్పటి నుంచే భూమి విషయం తెలిసి ఉండొచ్చంటోంది. ఉన్న పొలం అమ్ముకుని అప్పులు తీర్చుకుందామనుకున్న టైమ్లో ఇలా జరుగుతుందని ఊహించలేదని లత కన్నీరు పెట్టింది. తహసీల్దార్ విజయారెడ్డి హత్య తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడిన సురేష్ భార్య లత తన భర్తతో ఎవరో ఇదంతా చేయించారని గట్టిగా చెప్తోంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com