కలకలం సృష్టిస్తోన్న చిన్నారి అదృశ్యం
By - TV5 Telugu |11 Nov 2019 7:22 AM GMT
విజయవాడ భవానీపురం పీఎస్ పరిధిలో 8 ఏళ్ల బాలిక అదృశ్యం స్థానికంగా కలకలం రేపుతోంది. గుంటుపల్లి నల్లకుంటకు చెందిన ద్వారక.. ఇంటి దగ్గర ఆడుకుంటూ.. ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయింది. బాలిక మిస్సింగ్పై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ద్వారక అదృశ్యం కేసు నమోదు చేసుకున్న భవానీపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే రోజు గడిచిపోవడంతో.. పాప ఎలా ఉందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com