పయ్యావులను పరామర్శించిన చంద్రబాబు
పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు.. హైదరాబాద్ ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పయ్యావులను ఆయన పరామర్శించారు.
ఈ నెల 7వ తేదీన అసెంబ్లీ భవనంలో పీఏసీ సమావేశంలో ఆయన అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. సమావేశం కొనసాగుతున్న సమయంలోనే పయ్యావుల వాంతులు చేసుకొన్నారు. దీంతో పయ్యవులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డీహైడ్రేషన్ కు గురి కావడం వల్ల పయ్యావుల అనారోగ్యానికి గురయ్యారని డాక్టర్లు వెల్లడించారు.
సోమవారం చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణతో కలిసి వెళ్లి పయ్యావులను పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులను పలకరించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. పయ్యావులకు అందుతోన్న చికిత్స వివరాల గురించి డాక్టర్ల వద్ద ఆరా తీశారు. త్వరితగతిన కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com