అవినీతి తహసీల్దార్ కోసం గాలింపు చర్యలు
బినామీ చేత లంచం తీసుకుని ఏసీబీకి అడ్డంగా దొరికిన కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ హసీనాబి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా ఆమె అచూకీ దొరకడం లేదు. పక్కా సమాచారంతో సి.క్యాంపు ప్రభుత్వ క్వార్టర్స్ లో ఆమె కోసం ఏసీబీ అధికారులు వెళ్లారు. అప్పటికే అక్కడి నుంచి తప్పించుకున్నట్టు తెలుస్తోంది. కొత్తపల్లి ఎంపీడీవో గిడ్డయ్య సహకారంతో ఆమె ఏసీబీకి చిక్కకుండా తప్పించుకుంటున్నట్టు గుర్తించారు. గిడ్డయ్యతో ఆమె సహజీవనం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. గిడ్డయ్య కూడా మెడికల్ లీవులో ఉన్నాడు. ఇటీవల ఓ వ్యక్తి నుంచి 4లక్షలు లంచం డిమాండ్ చేసి.. సోదరుడి ద్వారా వసూలు చేస్తూ ఏసీబీకి చిక్కింది హసీనాబి. అప్పటి నుంచి ఆమె తప్పించుకుని తిరుగుతోంది. మొత్తానికి తహసీల్దార్ హసీనాబి వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com