జెరూసలేం యాత్రికులకు ఆర్థికసాయం పెంచిన జగన్ సర్కార్
By - TV5 Telugu |19 Nov 2019 10:34 AM GMT
జెరూసలేం యాత్రికులకు ఆర్థికసాయం పెంచుతూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. 3 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న వారికి ఇచ్చే సాయాన్ని 40 వేల నుంచి 60 వేలకు పెంచారు. 3 లక్షల కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారికి 20 వేల నుంచి 30 వేలకు పెంచారు.
జెరూసలేంతోపాటు ఇతర క్రైస్తవ ప్రార్ధనాస్థలాల సందర్శనకు వెళ్లే వారికి కూడా ఆర్ధికసాయం అందించాలని నిర్ణయించారు. జెరూసలేం యాత్రికులకు ఆర్థికసాయం పెంపుపై గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com