భర్తకు విషం కలిపిన మజ్జిగ.. సోదరుడికి అనుమానం రావడంతో..

భర్తకు విషం కలిపిన మజ్జిగ.. సోదరుడికి అనుమానం రావడంతో..

Milk

మూడు ముళ్లు..ఏడు అడుగులు.. ఇది కేవలం పెళ్లి తంతు మాత్రం కాదు.. నిండు నూరేళ్లు ఒకరికి ఒకరు తోడుగా బతుకుతాం అంటూ వేద మంత్రాల సాక్షిగా చేసే ప్రమాణం. కానీ ఇప్పుడు ఆ మాటకు అర్థమే మార్చేస్తున్నారు కొందరు..

కర్నూలు జిల్లా మదనంతపురానికి చెందిన యువతికి.. అదే జిల్లాలో జొన్నగిరికి చెందిన లింగయ్యకు గత ఆదివారం వివాహమైంది.. వివాహమైన తరువాత కాపురం కోసం అత్తంటికి వచ్చింది ఆమె.. కొత్త కోడలి రాకతో ఇళ్లంతా సందడిగా మారింది. నిండు నూరేళ్లు అత్తింటిలో కాపురం చేయాల్సిన ఆ కొత్త కోడలు.. తన కాళ్ల పారాణి ఆరకముందే.. పెళ్లి అయి కనీసం వారం రోజులు కూడా గడవకముందే.. కట్టుకున్న భర్తను కడతేర్చాలని స్కెచ్‌ వేసింది..

ప్రతి రోజూలానే భర్తకు ప్రేమగా మజ్జిగ అందించింది.. అందులో విషం కలిపింది అని తెలియక ఆ మజ్జిగ తాగిన లింగయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతడు తాగిన మజ్జిగ నుంచి వాసన రావడంతో అనుమానంతో లింగయ్య సోదరుడు వెంటనే అతడ్ని అనంతపురం జిల్లా గుత్తి ఆస్పత్రికి తరలించి వైద్యులకు పూర్తి వివారాలు చెప్పాడు.

విషయం తెలుసుకున్న వైద్యులు వెంటనే విషం బయటకు పోయేందుకు చికిత్స చేశారు. తరువాత మెరుగైన వైద్యం కోసం అనంత ఆస్పత్రికి తరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని లింగయ్య వాంగ్మూలం తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో వాళ్లు ఇష్టం లేని పెళ్లి చేసినందుకే భర్తను హత్య చేసేందుకు ప్రయత్నించిన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story