వైసీపీ సర్కార్ అమరావతిని చంపేస్తోంది: చంద్రబాబు
By - TV5 Telugu |27 Nov 2019 6:47 AM GMT
వైసీపీ సర్కార్ అమరావతిని చంపేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. అమరావతి అనేది రెండు లక్షల కోట్ల ఆస్తి అన్నారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ది చేసి, ప్రజారాజధాని ద్వారా సంపద సృష్టించాలనుకున్నామని చెప్పారు. కానీ మంత్రులే అమరావతిని స్మశానం అంటున్నారని.. APకి భవిష్యత్ లేకుండా చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో ఏం జరుగుతోందో అందరికీ తెలియ చెప్పేందుకే గురువారం అక్కడ పర్యటిస్తున్నానన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com