అమెరికాలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు..

అమెరికాలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు..

ap

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రవాసాంధ్రులు అమెరికాలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అమర జీవి పొట్టిశ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావుతోపాటు పలువురు తెలుగువారు పాల్గొన్నారు. పొట్టిశ్రీరాములు త్యాగం పలితంగా భాషాప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని ఈ సందర్భంగా మన్నవ సుబ్బారావు గుర్తుచేశారు. అమెరికాలోను రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story