అమెరికాలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు..
By - TV5 Telugu |5 Nov 2019 11:23 AM GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రవాసాంధ్రులు అమెరికాలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అమర జీవి పొట్టిశ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావుతోపాటు పలువురు తెలుగువారు పాల్గొన్నారు. పొట్టిశ్రీరాములు త్యాగం పలితంగా భాషాప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని ఈ సందర్భంగా మన్నవ సుబ్బారావు గుర్తుచేశారు. అమెరికాలోను రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com