కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుంది: బీజేపీ లక్ష్మణ్
By - TV5 Telugu |20 Nov 2019 11:25 AM GMT
సీఎం కేసీఆర్ ఓ నియంతలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. తరువాత జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ దగ్గర ఆర్టీసీ కార్మికులు చేస్తున్న దీక్షా శిబిరానికి వెళ్లి.. సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పుతో గెలిచిన కేసీఆర్ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఫామ్ హౌస్కు, ప్రగతి భవన్కే పరిమితమవుతున్నారని ఆరోపించారు. కోర్టును కూడా పట్టించుకోకుండా మాట్లాడుతన్నారని.. అందుకే తెలంగాణలో రోజు రోజుకూ సీఎం కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com