ట్విటర్ వేదికగా జగన్‌పై పవన్ వ్యంగ్యాస్త్రాలు

ట్విటర్ వేదికగా జగన్‌పై పవన్ వ్యంగ్యాస్త్రాలు

pawan-kalyan

ఏపీ సీఎం జగన్‌ తీరుపై సెటైర్‌ వేస్తూ ట్వీట్ చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. జగన్‌పై మరోసారి తీవ్ర విమర్శ చేస్తూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. జగన్‌ రెండు కాళ్లకు ఇసుక బస్తాలు కట్టి ఉన్న కార్టూన్‌ను ట్వీట్ కు ఎటాచ్ చేశారు..

ఏపీ సీఎం గురించి ఢిల్లీలో ఇలాంటి అభిప్రాయమే ఉంది అంటూ.. ట్వీట్‌ కింద కామెంట్‌ చేశారు. మొత్తం 175 సీట్లున్న అసెంబ్లీలో 151 స్థానాల్లో ప్రజలు వైసీపీని గెలిపించారని.. కానీ కేవలం 5 నెలల్లోనే 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధి దెబ్బతిందని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 50 మంది కార్మికుల ప్రాణాలు కోల్పోయేలా చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కింది అంటూ ట్వీట్‌ చేశారు.

జగన్‌పై సెటైర్లు వేయడంతో పాటు.. ఇటీవల గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసిన ఫోటోలను షేర్ చేస్తూ ట్వీట్‌ చేశారు పవన్‌. ఏపీలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల కష్టాలు, ఆత్మహత్యలపై గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. గవర్నర్ తాను చెప్పిన విషయాల్ని ఎంతో ఓర్పుగా విన్నారన్నారు పవన్‌. కార్తీక మాసం సందర్భంగా గవర్నర్‌కు మారేడు చెట్టును బహుమతిగా అందించారు పవన్‌.

Tags

Read MoreRead Less
Next Story