అందరికీ ఆమోదయోగ్యమైన రాజధానిని నిర్మిస్తాం : మంత్రి బుగ్గన

అందరికీ ఆమోదయోగ్యమైన రాజధానిని నిర్మిస్తాం : మంత్రి బుగ్గన

Buggana-Rajendranath-Reddy

రాజధాని పేరుతో టీడీపీ అందమైన కథలు చెప్పిందని ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి విమర్శించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో భూములు కొనుగోలు చేసి చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారని ఆరోపించారు. బినామీ పేర్లతో టీడీపీ నేతలు వందల ఎకరాలు కొనుగోలు చేశారని అన్నారు..పంట భూములను నాశనం చేసి...ప్లాట్లు వేయడానికి సింగపూర్‌ కంపెనీకి కట్టబెట్టారని మండిపడ్డారు.

రాజధాని నిర్మాణంపై శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను టీడీపీ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదన్నారు. రాజధాని ప్రాంత రైతులు ఇచ్చిన సూచనలు పాటించి.. అందరికీ ఆమోదయోగ్యమైన రాజధానిని నిర్మిస్తామన్నారు బుగ్గన. అమరావతిపై తుళ్లూరులో వైసీపీ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.. ఈభేటీకి రాజధాని రైతులతోపాటు పలు పార్టీల నేతలు హాజరయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story