దిశ కేసులో తాజా అప్ డేట్..

దిశ కేసులో తాజా అప్ డేట్..

disha

దిశ కేసులో వీలైనంత త్వరగా ఛార్జ్‌ ఛార్జ్‌షీట్ ఫైల్ చేసి..నిందితులకు కఠిన శిక్ష వేయించడమే టార్గెట్‌గా పనిచేస్తున్నారు పోలీసులు. ఇందుకోసం 7 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీమ్‌లో ఉన్నతాధికారి నుంచి కానిస్టేబుల్ వరకూ ఏడుగురు ఉంటారు. కేసులో కీలకమైన నిందితుల కస్టడీ ఎపిసోడ్‌ బాధ్యతలు డీసీపీ ప్రకాష్‌రెడ్డి నేతృత్వంలోని బృందం తీసుకుంది. విచారణకు సంబంధించిన వివరాలన్నీ అత్యంత సీక్రెట్‌గా ఉంచుతూ 11వ తేదీకల్లా వీలైనంత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ కేసులో సాక్ష్యాల పరిశీలనకు మరో బృందాన్ని ఏర్పాటు చేశారు. అలాగే DNA, ఫోరెన్సిక్ రిపోర్ట్‌ల విశ్లేషణకు ఒక టీమ్‌ను, లీగల్ ప్రొసీడింగ్స్‌కు ఇంకో టీమ్‌ను నియమించారు. ప్రధాన సాక్ష్యులు, ప్రత్యక్ష సాక్షుల విచారణ, ఐడెంటిఫికేషన్‌ కోసం మరో టీమ్ పనిచేస్తోంది. సీసీ ఫుటేజ్ విశ్లేషణ, టెక్నికల్ ఎవిడెన్స్ సేకరణ కోసం ఓ బృందం ఉంది. సీన్‌ టు సీన్‌ అనాలసిస్‌, క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం మరో టీమ్ పనిచేస్తోంది. ప్రతి దశలోనూ చిన్న ఆధారాన్ని కూడా వదలకుండా ఛార్జ్‌షీట్ పక్కాగా ఉండేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు.

దిశ ఘటన జరిగిన ప్రాంతం నుంచి అరకిలోమీటర్ దూరంలో మొబైల్‌తోపాటు మరికొన్ని వస్తువుల్ని నిందితులు పాతిపెట్టినట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు.. క్లూస్‌ టీమ్‌ మరోసారి లారీని పరిశీలించింది. గతంలోనే రక్తపు మరకలు, వెంట్రుకలు వంటి ఆధారాల్ని సేకరించినా ఇంకా ఏమైనా అదనపు క్లూ దొరుకుందేమోనని దృష్టి పెట్టారు. అటు, కస్టడీలో ఉన్న నిందితుల్ని రహస్య ప్రదేశంలో విచారిస్తున్న పోలీసులు.. ఎలాంటి వివరాలు రాబడుతున్నారు అనేది కూడా ఉత్కంఠ రేపుతోంది.

దిశపై హత్యాచారం, హత్య ఘటనపై విచారణను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్‌ ఏర్పాటు చేసింది. ఇక్కడ వాయిదాలు లేకుండా రోజువారీ విచారణ జరుగుతుంది.. పోలీసులు త్వరగా ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తే నెల రోజుల్లోపే తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story