చట్టాలు అమలు చేసేవారిలో చిత్తశుద్ధి ఉండాలి: చంద్రబాబు
By - TV5 Telugu |9 Dec 2019 12:47 PM GMT
ఏపీలో అత్యాచారాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు ఉన్నంతమాత్రాన సరిపోదని.. వాటిని అమలు చేసేవారిలో చిత్తశుద్ధి ఉండాలన్నారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన ఆయన.. వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. గత ఆరు నెలల్లో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెచ్చుమీరాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో మహిళ భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. దిశ సంఘటన సత్వర న్యాయం అవసరాన్ని నొక్కి చెప్పిందన్నారు. పోలీసులు, ప్రభుత్వలు, న్యాయస్థానాలే కాదు.. ప్రతి పౌరుడికి ఇది కనువిప్పు కావాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అఘాయిత్యాలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలు తేవాల్సిన బాధ్యత ఉందన్నారు చంద్రబాబు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com