దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ వ్యవహారంలో విచారణ వేగవంతం

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ వ్యవహారంలో విచారణ వేగవంతం

rapists-encounter

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఎన్‌కౌంటర్‌ వ్యవహారంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణ కొనసాగుతోంది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులకు విచారణ కోసం తెలంగాణ పోలీస్‌ అకాడమిలో ఐ.ఒ.ఎం కాంప్లెక్స్‌ను కేటాయించారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నిందితులకు పంచనామా చేసిన రెవిన్యూ అధికారులను సోమవారం విచారణ చేసిన ఎన్‌హెచ్‌ఆర్‌సి బృందం నాలుగో రోజు విచారణను ఇంకాస్త ముమ్మరం చేసింది. దిశ కేస్‌లో నమోదు చేసిన ఎఫ్‌ ఐఆర్‌, ఎన్‌కౌంటర్‌ తరువాత నమోదు అయిన మరో ఎఫ్ఐఆర్‌ కాపీని కూడా ఎన్‌హెచ్‌ఆర్‌సి బృందం పరిశీలించనుంది. అలాగే గాయపడ్డ పోలీస్‌ సిబ్బంది ఇద్దరిని ఇప్పటికే మూడు సార్లు కలిసిన ఎన్‌హెచ్‌ఆర్‌సి టీమ్‌.. మంగళవారం హైదరాబాద్‌లోనే పర్యటించే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story