రైతు సమస్యలపై కాకినాడలో పవన్ దీక్ష
By - TV5 Telugu |12 Dec 2019 3:44 AM GMT
రైతు సమస్యల పరిష్కారం కోరుతూ కాకినాడలో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీక్ష చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకూ ఆయన రైతు సౌభాగ్య దీక్ష చేస్తారు. పవన్ దీక్షకు భారీగా రైతులు, జనసైనికులు భారీగా తరలివచ్చారు. ఈ దీక్ష వేదికపై రైతుల నుంచి వినతులు స్వీకరించనున్నారు పవన్. తరువాత వ్యవసాయరంగ నిపుణులు, రైతులతో మాట్లాడించనున్నారు. ధాన్యం కొనుగోళ్లలో లోపాలు, నగదు చెల్లింపుల్లో జాప్యం సహా.. ఇతర సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. పవన్ దీక్షలో జనసేన పార్టీ నేతలు నాగబాబు, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com