అసెంబ్లీలో రాజధానిపై రచ్చ.. టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్
రాజధానిపై చర్చ సందర్భంగా ఏపీ అసెంబ్లీలో రచ్చ అయ్యింది. మంత్రి బుగ్గన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. స్పీకర్ పోడియాన్ని చుట్టు ముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజా రాజధానికి సంబంధించి వాస్తవాలపై చర్చ జరపాలని పట్టుబట్టారు. టీడీపీ నేతలు నినాదాలు చేయడంపై సీఎం జగన్ మండిపడ్డారు. ప్రజలకు అవాస్తవాలు తెలియకుండా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. వెంటనే వారిని సస్పెండ్ చేయాలని స్పీకర్ను కోరారు.
టీడీపీ నేతల తీరుపై సీరియస్ అయిన మంత్రి బుగ్గన.. వారిని సస్పెండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. సభ కార్యకలాపాలు సవ్యంగా జరగాలంటే వారిని సస్పెండ్ చేయక తప్పదని చెప్పారు.
పదే పదే తాను హెచ్చరించినా టీడీపీ సభ్యులు తీరు మార్చుకోలేదని స్పీకర్ మండిపడ్డారు. పోడియం చుట్టుముట్టి నినాదాలు చేస్తున్న తొమ్మిదిమంది టీడీపీ నేతలను స్పీకర్ సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడు, రామానాయుడు, రామకృష్ణబాబు, అశోక్, బాలవీరాంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్, మద్దాల గిరి, గద్దె రామ్మోహన్, వై.సాంబశివరావు లను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకంటించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com