ప్రాణహిత నదిలో పడవ బోల్తా
By - TV5 Telugu |1 Dec 2019 7:29 AM GMT
కొమురంభీం జిల్లా ప్రాణహిత నదిలో పడవ మునిగింది. ఆరుగురు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లతో వెళ్తున్న పడవ.. చింతమానే పల్లి మండలం గూడెం వద్ద బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు గల్లంతయ్యారు. మరో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. మహారాష్ట్ర ఆహేరి నుంచి గూడెంకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com