మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి : రైతుల డిమాండ్
By - TV5 Telugu |21 Dec 2019 12:37 PM GMT
రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రోజు రోజుకు ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. మందడంతో పాటు తుళ్లూరులో మహాధర్నా చేపట్టారు రైతులు. వెలగపూడిలో నిరాహార దీక్ష కొనసాగుతోంది.. రాజధాని పరిధిలోని 29 గ్రామాల ప్రజలు ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వం వెంటనే మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వెలగపూడిలో రైతుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.. కుటుంబాలతో సహా వచ్చి దీక్షలు చేస్తున్నారు.. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.. మెడకు ఉరితాడు వేసుకుని రైతులు నిరసన తెలుపుతున్నారు. రాజధాని అమరావతే అని ప్రకటించకుంటే ఉరి వేసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com