విశాఖ కేంద్రంగా రాజకీయ చర్చ
By - TV5 Telugu |21 Dec 2019 8:21 AM GMT
ఛలో విశాఖ అనే అభిప్రాయం ఇప్పుడు ఏపీ ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పాలన అంతా అక్కడ్నుంచే సాగించే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జీఎన్రావు కమిటీ నివేదిక నేపథ్యంలో రాష్ట్రమంతటా విశాఖ పేరు మారుమోగిపోతోంది. నిపుణుల కమిటీ కూడా విశాఖ నగరానికే పెద్ద పీట వేయడంతో చర్చ విశాఖ గురించే జరుగుతోంది. సెక్రటేరియట్, హైకోర్టు బెంచ్, సీఎం క్యాంప్ ఆఫీస్, వేసవి అసెంబ్లీ సమావేశాలకు విశాఖ అనుకూలమనే అభిప్రాయం అక్కడి వారిలో వ్యక్తమవుతోంది. అధికారులు కూడా భవనాల పరిశీలనలో తలమునకలైనట్లుగా తెలుస్తోంది. ఒకవేళ సచివాలయం ఏర్పాటు చేయాల్సి వస్తే ఏప్రాంతంలో ఏర్పాటు చేస్తారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com