తిరుపతిలో రౌడీషీటర్ హత్య
తిరుపతిలో రౌడీషీటర్ హత్య కలకలం రేపుతోంది. గుర్తు తెలియని దుండగులు మురళిని వేటాడి వెంటాడి చంపేశారు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. రౌడీషీటర్ను దారుణంగా చంపిన గుర్తు తెలియని దుండగులు.. అక్కడి నుంచి ఓ బైక్పై పరారవుతున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖాలకు మాస్క్లు కట్టుకుని ఈ హత్యకు పాల్పడ్డారు.
సినీ ఫక్కీలో జరిగిన ఈ మర్డర్ తిరుపతిలో సంచలనం సృష్టించింది. టీ తాగేందుకు వచ్చిన మురళిపై ఏడుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. మురళి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రాణం పోయిందని నిర్ధారించుకున్న తరువాత ముసుగులు ధరించిన దుండగులు... ఆటో, బైక్పై అక్కడి నుంచి పరారయ్యారు. మరో వ్యక్తిపైనా దుండగులు దాడికి పాల్పడగా.. అతను గాయాలతో బయటపడ్డాడు.
గతంలో జరిగిన హత్యకు ప్రతీకారంగానే ఈ హత్య జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుడు మురళి పాతనేరస్థుడు కావటం, ఇతనిపై తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో ఓ హత్య కేసులో ఏ1 ముద్దాయిగా ఉండటంతో... పాతకక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com