పూర్తైన రీపోస్టుమార్టం.. ఒక్కొక్కరి బాడీలో ఎన్ని బులెట్లు?

పూర్తైన రీపోస్టుమార్టం.. ఒక్కొక్కరి బాడీలో ఎన్ని బులెట్లు?

dia.png

దిశ కేసులో నిందితుల డెడ్ బాడీస్ కు రీపోస్టు మార్టమ్ నిర్వహించాలని.. తెలంగాణ హైకోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను తెలంగాణ వైద్యులతో కాకుండా.. ఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్ వైద్యులచే నిర్వహించాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ వైద్యుల బృందం.. సుమారు నాలుగు గంటల పాటు నిందితుల మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించింది. సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన రీపోస్ట్ మార్టమ్ ప్రక్రియ మధ్యాహ్నం వరకు పూర్తయింది.

సోమవారం ఉదయం మృతదేహాలను కుటుంబ సభ్యులు గుర్తించిన తర్వాతే రీపోస్టుమార్టం ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో చేసిన వైద్య బృందానికి సంబంధం లేకుండా.. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు రీపోస్టుమార్టమ్ నిర్వహించారు. ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ శాఖ అధిపతి సుధీర్ గుప్తాతో పాటు అభిషేక్ యాదవ్, ఆదర్శ్ కుమార్ వైద్య బృందం రీపోస్టుమార్టమ్ నిర్వహించారు. అయితే అంతకు ముందు మృతదేహాలకు ఎక్స్‌రే తీశారు. ఈ ఎక్స్ రేలో.. మహ్మద్ ఆరీఫ్ బాడీలో- 4, జొల్లు శివ బాడీలో-3, జొల్లు నవీన్ బాడీలో -2, చెన్నకేశవులు బాడీలో ఒక బుల్లెట్ గుర్తించినట్టు తెలుస్తోంది. ఇక, రీపోస్టుమార్టమ్ ప్రక్రియనంతా ఎయిమ్స్ వైద్యులే వీడియో తీశారు. ఈ వీడియోను రెండు రోజుల్లో తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ కు అప్పగించనున్నట్లు తెలిపారు. రీపోస్టుమార్టమ్ పై పూర్తి నివేదికను సీల్డ్‌ కవర్‌లో హైకోర్టుకు సమర్పించనున్నారు.

ఇదిలావుంటే, రీపోస్టుమార్టమ్ ప్రక్రియ హైకోర్టు ఆదేశాల ప్రకారమే జరిగినట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ స్పష్టం చేశారు. గతంలో ఫోరెన్సిక్ వైద్యులు చేసింది ఏంటో తమకు తెలియదని.. నింబంధనల ప్రకారం ఇప్పుడు రీ పోస్టుమార్టం జరిపామని అన్నారు. నిందితుల మృతదేహాలకు ఎంబామింగ్ ఏమి జరగలేదని.. 2 నుంచి 4 రోజులు రీ ఫ్రిజిరేటర్‌లో పెట్టామని.. మృతదేహాలు 50 శాతానికి పైగా డీ-కంపోజ్ అయ్యాయని డాక్టర్ శ్రవణ్ తెలిపారు.

ఇక, రీపోస్టుమార్టమ్ పూర్తయిన తర్వాత నాలుగు మృతదేహాలను పోలీసులు వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. డెడ్ బాడీస్ అప్పగించే ముందు కుటుంబ సభ్యుల సంతకాలు తీసుకున్నారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story