చంద్రబాబు పేరు మీద విశాఖలో ఒక్క శిలాఫలకం కూడా లేదు: బొత్స

చంద్రబాబు పేరు మీద విశాఖలో ఒక్క శిలాఫలకం కూడా లేదు: బొత్స

botsa

చంద్రబాబు మాయలో పడి అమరావతి రైతులు మోసపోవద్దని మంత్రి బొత్స హెచ్చరించారు. అమరావతిని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. విశాఖలో జిల్లా కలెక్టర్‌తో మున్సిపల్‌ శాఖ రివ్యూలో పాల్గొన్న బొత్స.. చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. విశాఖ అభివృద్ధి కోసం చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు. ఒక్క శిలాఫలకంపైనైనా చంద్రబాబు పేరు ఉందా అని ప్రశ్నించారు. విశాఖ ముఖ చిత్రం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే మారిందన్నారు. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడే ఐటీ కంపెనీలు, ఫార్మసిటీ, ఎస్‌ఈజెడ్‌లు వచ్చాయన్నారు బొత్స.

విశాఖలో ప్రభుత్వ భూములను పరిశీలించమని తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు జిల్లా కలెక్టర్‌. సీఎం ఆదేశాలు ఇస్తే తప్పకుండా అందుబాటులో ఉన్న భూములను పరిశీలిస్తామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story