కడప జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు జగన్ శంకుస్థాపన
By - TV5 Telugu |24 Dec 2019 12:08 PM GMT
కడప జిల్లా రాయచోటిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. 12వందల72 కోట్లతో G.N.S.S మెయిన్ కెనాల్ నుంచి ఆయకట్టును స్థిరీకరించేందుకు ఏర్పాటు చేయనున్న ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. 340 కోట్లతో రాయచోటిలో చేపట్టే అండర్గ్రౌండ్ డ్రైనేజీ, పట్టణాభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపన చేశారు. రాయచోటి ఆస్పత్రిని 50 నుంచి 100 పడకలకు విస్తరించే పనులు, గ్రామ సచివాలయ భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణం, కడప డిస్ట్రిక్ట్ పోలీసు కార్యాలయ భవనాలకు శిలాఫలకాలను ఆవిష్కరించారు సీఎం జగన్.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com