ఓ కామాంధుడికి తగిన బుద్ధిచెప్పిన మహిళ
By - TV5 Telugu |25 Dec 2019 10:05 AM GMT
వెంటపడి వేధిస్తున్న ఓ కామాంధుడికి తగిన బుద్ధిచెప్పిందో మహిళ. నెల్లూరు జిల్లా గుడిపాడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బాదుల్లా.. ఖాదరున్నీసా అనే మహిళను లైంగికంగా వేధిస్తున్నాడు. విసిగిపోయిన బాధితురాలు.. అతడి ఆటోను పెట్రోల్ పోసి తగలబెట్టింది. కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది ఖాదరున్నీసా. దీన్ని అలుసుగా తీసుకున్న బాదుల్లా వేధింపులు తీవ్రం చేశాడు. దీంతో అతడి ఆటోపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఖాదరున్నీసా.. ఆ తర్వాత కనిపించకుండా పోయింది.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com