సీఎం జగన్కు రాయలసీమ నేతల లేఖ
గ్రేటర్ రాయలసీమ పరిధిలోనే రాజధానిని ఏర్పాటు చేయాలంటూ ఆ ప్రాంత నేతలు సీఎం జగన్కు లేఖ రాశారు. పరిపాలనా వికేంద్రీకరణను తాము సమర్థిస్తున్నామని అయితే ఈ వికేంద్రీకరణలో రాయలసీమకు న్యాయం జరగాలన్నదే తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు. 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో రాయలసీమ వాసులు.. వైసీపీని అత్యధిక స్థానాల్లో గెలిపించిన అంశాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు. గతంలో ఆంధ్రరాష్ట్ర రాజధానిగా కర్నూలు ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ఆ రోజుల్లో తెలుగువారి ఐక్యత కోసం కేపిటల్ను త్యాగం చేశామన్నారు. ఇప్పటికైనా రాయలసీమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. ఈ ప్రాంత ప్రజల త్యాగాలను వృథా పోనివ్వద్దని విజ్ఞప్తి చేశారు. లేఖపై మాజీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ డీజీపీలు, సీనియర్ జర్నలిస్టులు, న్యాయవాదులు సంతకాలు చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com