రాజధాని మార్పుకు నిరసనగా కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్ష
By - TV5 Telugu |27 Dec 2019 7:07 AM GMT
రాజధాని మార్పును నిరసిస్తూ ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మౌనదీక్ష చేపట్టారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. గుంటూరులోని తన నివాసం నుంచి ఉద్దండరాయపాలెంకు ర్యాలీగా చేరుకున్న కన్నా.. మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం అక్కడే బీజేపీ నేతలతో కలిసి మౌన దీక్షకు దిగారు. రాజధాని మార్పు సరికాదని.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com