CAA పై అవగాహన కల్పించేందుకు తెలంగాణలో బీజేపీ సభలు
By - TV5 Telugu |30 Dec 2019 7:17 AM GMT
పౌరసత్వం సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో.. బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యక్ష్యంగా రంగంలో దిగింది. దేశ ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే.. సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణలో మూడు చోట్ల సీఏఏ మద్దతు సభలు నిర్వహించనున్నారు. విపక్షాల ఆరోపణలు తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాలు వివరించడమే లక్ష్యంగా సభలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్, కరీంనగర్, గద్వాలలో నిర్వహించే సీఏఏ మద్దతు సభల్లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జితేంద్ర సింగ్, అనురాగ్ ఠాకూర్ పాల్గొంటారు. ఇందిరా పార్క్లో జరిగే సభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొంటున్నారు. కరీంనగర్లో జరిగే సభలో మరో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొంటారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com