టీడీపీ నేతపై వైసీపీ వర్గీయుల దాడి

టీడీపీ నేతపై వైసీపీ వర్గీయుల దాడి

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో రాజకీయ కక్షలు తీవ్రరూపం దాల్చాయి. పొన్నూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైఎస్ చైర్మన్, టీడీపీ నేత బండ్లమూడి బాబూరావుపై వైసీపీ వర్గీయులు దాడిచేశారు. తీవ్రగాయాలపాలైన బాబూరావును గుంటూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందంటున్నారు బంధువులు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలను జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story